నల్లగొండలో జంట హత్యల కలకలం

by  |
నల్లగొండలో జంట హత్యల కలకలం
X

దిశ ప్రతినిధి నల్లగొండ: జిల్లాలో జంట హత్యలు కలకలం రేగింది అనుముల మండలం హాజరు గూడెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. హాజరు గూడెం గ్రామానికి చెందిన జానపాటి సత్యనారాయణ, జానపద హరి, జానపాటి అంజి ముగ్గురు అన్నదమ్ములు.

అయితే రాత్రి సమయంలో ఒకటే కుటుంబానికి చెందిన జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి అనే ఇద్దరు సోదరులను ఇంటి బయట పడుకోగా మంచాల్లోనే గొడ్డళ్ళతో దుండగులు నరికి చంపారు. అయితే మూడు సోదరుడు హరి దుండగుల నుంచి తృటిలో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సరిగ్గా సంవత్సరం క్రితం హాలియకు చెందిన రేవంత్ అనే యువకుడు పాల సేకరణ కోసం హాజరి గూడం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా కాపు కాసి సత్యనారాయణ, హరి, అంజి అనే ముగ్గురు అన్నదమ్ములు హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అన్నదమ్ములు జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యారు.

ఈ ముగ్గురు అన్నదముల్లో హరి అనే వ్యక్తి భార్యతో రేవంత్ కి అక్రమసంభంధం ఉండగా, ఆ గొడవల్లో ఈ ముగ్గురు అన్నదమ్ములు రేవంత్ ని హత్య చేశారు. ఈ రోజు రేవంత్ తల్లి ఇందిరా, మరో ఇద్దరి సాయంతో ప్రతీకారంగా హాజరు గూడం గ్రామానికి అర్ధరాత్రి వెళ్లి ముగ్గురిని హత్య చేయాలని ప్లాన్ చేసి గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సత్యనారాయణ అంజి ఇద్దరు చనిపోయారు. రెండో సోదరుడైన హరి పై దాడి చేసినప్పటికీ తృటిలో తప్పించుకున్నాడు. పోలీసులు దీన్ని ప్రతీకార హత్యగా భావిస్తున్నారు.

Next Story

Most Viewed