పలాసలో జేసీబీతో అంతిమయాత్ర

by  |
పలాసలో జేసీబీతో అంతిమయాత్ర
X

దిశ, వెబ్‌డె‌స్క్: కరోనా మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇది వరకు ఎవరైనా చనిపోతే డప్పువాయిద్యాలతో పదుల సంఖ్యలో జనాలు అంత్యక్రియలకు హాజరయ్యేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరైనా చనిపోతే దగ్గరి బంధువులు కూడా కడసారి చూపునకు రావడం లేదు. అంతిమ యాత్రకు అవసరమైన ఆ నలుగురు కూడా రావడానికి జంకుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా శ్రీకాకులం జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం పలాసలో కరోనా లక్షణాలతో ఓ మున్సిపల్ ఉద్యోగి మరణించాడు. దీంతో మృతదేహాన్ని చూడటానికి బంధువులు, స్థానికులు రాలేదు. చివరికి మృతదేహాన్ని అనాథలా జేసీబీ సహాయంతో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు అధికారులు.

Next Story

Most Viewed