పాజిటివ్‌లు తక్కువ చూపితే కరోనా తగ్గదు

by  |
పాజిటివ్‌లు తక్కువ చూపితే కరోనా తగ్గదు
X

దిశ, న్యూస్‌బ్యూరో: పాజిటివ్ కేసులను తక్కువ చేసి చూపిస్తే కరోనా వైరస్ తగ్గదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇలాంటి తప్పుడు అంకెలతో ప్రజలను మోసగించొద్దని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలను పెంచడంతో పాటు పాజిటివ్ కేసుల వివరాలను నిజాయితీగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జిల్లా అధికారులు ప్రకటించిన కరోనా పాజిటివ్‌లు 4,325గా ఉంటే, ప్రభుత్వం వెల్లడించిన కేసులు 2,474గా ఉన్నాయని, ఇదేమి పారదర్శకత అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.



Next Story

Most Viewed