సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

by  |
సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం
X

న్యూఢిల్లీ: సీపీఐ(ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి ఇంట్లో విషాధం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనా సోకి కన్నుమూశారు. గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన గురుగ్రావ్ లోని మేదాంత ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. రెండు వారాలుగా ఆశిష్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరిని కోల్పోయానని తెలియజేయడం చాలా విచారంగా ఉంది. అతడు కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ, ఆశిష్‌కు చికిత్స చేసిన వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతలు..’ అని ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్ ఏచూరి ఢిల్లీలోని ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. రెండు వారాల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. అప్పట్నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. కానీ పరిస్థితులు విషమించి గురువారం ఉదయం కన్నుమూశారు.


Next Story