బీడీ కార్మికులను ఆదుకోవాలి

by  |

సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ డిమాండ్

దిశ, న్యూస్‌ బ్యూరో :
బీడీ పరిశ్రమల‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆర్థిక సాయంతో ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 7లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నరని తెలిపారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు మూసివేయడంతో కార్మికులకు ఉపాధి కరువై తినడానికి తిండీ లేక నానా అవస్థలు పడుతున్నారనీ, రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ.5 వేలు, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు.

Tags: CPI State Secretary, chada venkat reddy, letter, to cm KCR, beedi workers



Next Story

Most Viewed