‘బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోంది’

by  |
‘బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోంది’
X

దిశ, సిద్దిపేట: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన టీఆర్‌ఎస్ పార్టీ, ప్రజా క్షేత్రంలో ఎందుకు వ్యతిరేకించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను, మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రత్యక్ష పెట్టబడులలో విదేశీ కంపెనీలకు అవకాశం కల్పించి కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం చేస్తుందనీ దుయ్యబట్టారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ నియంత్రణను తొలగించి రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకున్న లాభాలు వస్తాయని అనడం హాస్యాస్పదం అన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు.


Next Story

Most Viewed