- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీహరికోటను కూడా ప్రైవేటీకరిస్తున్నమోదీ : సీపీఐ రామకృష్ణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్వనాశనం చేస్తున్నారని సీపీఐ ఏపీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేలను ప్రైవేటీకరించేందుకు నడుం బిగించడంపై మండిపడ్డారు. చివరకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని కూడా ప్రైవేటుకు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. మోదీ చర్యలను నిరసిస్తూ ఈనెల 9న చలో శ్రీహరికోట కార్యక్రమానికి పిలుపిస్తున్నామని […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్వనాశనం చేస్తున్నారని సీపీఐ ఏపీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేలను ప్రైవేటీకరించేందుకు నడుం బిగించడంపై మండిపడ్డారు. చివరకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని కూడా ప్రైవేటుకు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
మోదీ చర్యలను నిరసిస్తూ ఈనెల 9న చలో శ్రీహరికోట కార్యక్రమానికి పిలుపిస్తున్నామని ఆయన తెలిపారు. వైజాగ్లోని ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి ఆ కంపెనీ యాజమాన్యమే కారణమని చెబుతూ, వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






