శ్వేత పత్రం విడుదల చేయాలి: సీపీఐ రామకృష్ణ

by  |
శ్వేత పత్రం విడుదల చేయాలి: సీపీఐ రామకృష్ణ
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది పాలనలో అప్పులను రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం పెంచి.. చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ ట్రస్ట్ నుంచి అప్పు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోరటం నిజమా కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంతకీ ప్రభుత్వం అప్పు అడుగుతున్న విదేశీ ట్రస్ట్ పేరు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed