సీపీఐకి షాక్.. కాంగ్రెస్‌లో భారీ చేరికలు

by  |
Former MLC Prem Sagar
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని కోల్ బెల్ట్ ప్రాంతంలో సుదీర్ఘకాలం నుండి సీపీఐ పార్టీలో పనిచేసిన 250 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు. అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి, అన్నీ విస్మరించారని విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో శ్యామ్, రవి, కృష్ణమూర్తి, శంకర్, యాదగిరి, సంపత్ కుమార్, రామబ్రహ్మం, శ్రీనివాస్, నరేష్, హరీష్, రాకేష్, లావణ్య, స్వరూప, సులోచన, రమాదేవి, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రజిత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేణు, నాయకులు మల్లేష్, ఖలీద్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed