సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాకి అస్వస్థత

by  |
సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాకి అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అస్వస్థతకు గురయ్యారు. శనివారం సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాజా షుగర్ లెవెల్స్ పడిపోవడంతో సమావేశంలోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు రాజాను కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు రెండ్రోజులు జరుగనుండగా, మొదటి రోజు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల కోసం దేశవ్యాప్తంగా సీపీఐ జాతీయ నాయకులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్‌ అంజన్‌, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

Next Story