కల్నల్ భార్య, పిల్లలను రిసీవ్ చేసుకున్న సజ్జనార్

by  |
కల్నల్ భార్య, పిల్లలను రిసీవ్ చేసుకున్న సజ్జనార్
X

దిశ, రంగారెడ్డి: చైనా-ఇండియా బోర్డర్లో వీరమరణం పొందిన సంతోష్ బాబు భార్య, ఇద్దరు పిల్లలను శంషాబాద్ ఎయిర్ పోర్టులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిలు రిసీవ్ చేసుకున్నారు. ఢిల్లీ నుంచి వారు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు చేరుకున్నారు. వారిని ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తరలించనున్నారు. సూర్యాపేటలో సంతోష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేటలోని సంతోష్ ఇంటి వద్ద ఆర్మీ కరోనా చర్యలు చేపట్టింది. సంతోష్ బాబుకు నివాళులర్పించే సమయంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తుంది.



Next Story

Most Viewed