- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కూకట్పల్లి : కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఏఎస్సై మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో బుధవారం జరిగాయి. బండ్లగూడ జాగీర్, కిస్మత్ పూర్లోని మహిపాల్ రెడ్డి నివాసం వద్ద ఆయన కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరామర్మించారు.
అనంతరం మహిపాల్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్వయంగా మహిపాల్ రెడ్డి అంత్యక్రియలలో పాల్గొని పాడే మోశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని బెన్ఫిట్స్.. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు మహిపాల్ రెడ్డి అవయవాలను జీవన్ దాన్కు దానం చేశారు.
Next Story