అక్కడికి వెళ్లినప్పుడు ఆయనెవరో తెలీదు !

by  |
అక్కడికి వెళ్లినప్పుడు ఆయనెవరో తెలీదు !
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో రాజకీయాలు లేవని సీపీ ఆర్కే మీనా అన్నారు. ఘటనపై ఆయన మరోసారి వివరణ ఇస్తూ, ఘటనాస్థలిలో ఓ పౌరుడితో వైద్యుడు దురుసుగా ప్రవర్తించినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఘటనపై సమాచారం అందుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆయనెవరో కూడా తెలియదన్నారు. అందుకే డాక్టర్ సుధాకర్ విషయంలో గతంలో జరిగిన సంఘటనలకు దీనికి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆ డాక్టర్ తాగివున్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారని సీపీ పేర్కొన్నారు. ఆ డాక్టర్‌ను ఇంటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారని, వీడియోలో చూస్తే ఆ డాక్టర్ ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. అప్పటికీ తమ సిబ్బంది ఎంతో ఓపికతో వ్యవహరించారని వివరించారు.

Next Story

Most Viewed