- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో రాజకీయాలు లేవని సీపీ ఆర్కే మీనా అన్నారు. ఘటనపై ఆయన మరోసారి వివరణ ఇస్తూ, ఘటనాస్థలిలో ఓ పౌరుడితో వైద్యుడు దురుసుగా ప్రవర్తించినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఘటనపై సమాచారం అందుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆయనెవరో కూడా తెలియదన్నారు. అందుకే డాక్టర్ సుధాకర్ విషయంలో గతంలో జరిగిన సంఘటనలకు దీనికి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆ డాక్టర్ తాగివున్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారని సీపీ పేర్కొన్నారు. ఆ డాక్టర్ను ఇంటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారని, వీడియోలో చూస్తే ఆ డాక్టర్ ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. అప్పటికీ తమ సిబ్బంది ఎంతో ఓపికతో వ్యవహరించారని వివరించారు.
Next Story