లాక్‌డౌన్‌ను ప్రజలు కచ్చితంగా పాటించాలి

by  |
లాక్‌డౌన్‌ను ప్రజలు కచ్చితంగా పాటించాలి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ అందరూ కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఇళ్లు విడిచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు అందరూ ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. ప్రతి మసీదులో మౌలానాతో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమంతి ఉంటుందని, దీనిని ఎవరు అతిక్రమిచినా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంట్లో జరిగే ప్రార్థనలు కూడా సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన 1800 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలు సీజ్ చేస్తామని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాని హెచ్చరించారు.


Next Story