పున్నమి ఘాట్‌లో గోవుల మృతి కలకలం

by  |
పున్నమి ఘాట్‌లో గోవుల మృతి కలకలం
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ పున్నమి ఘాట్‌లో గోవుల మరణం కలకలం రేపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతోనే గోవులు మరణించాయని అధికారులు వెల్లడించారు. వర్షాలు, గాలి కారణంగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, వాటిని ఎవరూ గమనించలేదని, వాటిని తాకినందునే ఆవులు చనిపోయాయని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకు దిగారు. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed