- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: 18 ఏళ్లు నిండినవారికి కరోనా టీకా వేసుకునేందుకు గాను కేంద్రం ప్రారంభించిన వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్కు ఆదిలోనే అంతరాయం కలిగింది. టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో కొవిన్, ఆరోగ్య సేతు యాప్లు కొంతసేపు క్రాష్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఆత్రుతలో లక్షలాది మంది యువత రెండు యాప్లను ఓపెన్ చేయడం కూడా ఈ సమస్యకు ఒక కారణమని సమాచారం.
అయితే పలు యూజర్లు మాత్రం తాము 18 ఏళ్లు నిండినా.. యాప్ మాత్రం దానిని తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవగానే కొద్దిసేపు కొవిన్, ఆరోగ్య సేతు కొంతసేపు క్రాష్ అయ్యాయి. అయితే గంట తర్వాత సమస్యను గుర్తించి దానిని ఫిక్స్ చేశామని, అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.
Next Story