రాజమండ్రిలో 200 పడకలతో కొవిడ్ ఆస్పత్రి

by  |
రాజమండ్రిలో 200 పడకలతో కొవిడ్ ఆస్పత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ కొరలు చాస్తోంది. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ తగు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న జిల్లాల్లో తూర్పు గోదావరి కూడా ఉంది. దీంతో ఇక్క 200 పడకలతో ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజ్ కొత్త బ్లాక్‌లో 200 పడకలతో కూడిన హాస్పిటల్‌ను నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ భరత్ కొత్త బ్లాక్‌ను పరిశీలించారు. అత్యాధునిక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా మొత్తం 200 పడకలకు పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్‌ను అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ఈ ఆస్పత్రి నిర్మిస్తున్నట్టు ఎంపీ భరత్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed