ముగిసిన జేసీ రిమాండ్.. కడప జైలుకి తరలింపు

by  |
ముగిసిన జేసీ రిమాండ్.. కడప జైలుకి తరలింపు
X

దిశ, ఏపీ బ్యూరో: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల రిమాండ్ ముగిసింది. దీంతో వారిని అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో తమను అక్రమంగా ఇరికించారని ఏపీ హైకోర్టులో ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తమపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, కేసులో తదుపరి చర్యలను నిలిపివేసేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.

Next Story

Most Viewed