5 వేల దీపాలు వెలిగించి.. మొక్కు తీర్చుకున్న భక్తుడు

by  |
Mudhol-1
X

దిశ, ముధోల్: ముధోల్ నియోజకవర్గం బైంసా పట్టణంలోని నేతాజీ నగర్ ప్రాంగణంలో గల సాయిబాబా ఆలయంలో ఓ భక్తుడు 5000 దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బాబ్లీ గ్రామానికి చెందిన శేషరావు పటేల్ – జ్యోతిక దంపతులు. తమకు కొడుకు పుడితే దీపావళి రోజున దీపాలు వెలిగిస్తామని వారు మొక్కుకున్నారు. వారికి కొడుకు పుట్టడంతో శుక్రవారం శేషరావు పటేల్ 5 వేల దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకున్నాడు. దీపాలు వెలిగించడంతో గుడి ప్రాంగణమంతా దీపాల కాంతులతో కనిపించింది.


Next Story