భూవివాదంలో దంపతులకు గాయాలు

by  |
భూవివాదంలో దంపతులకు గాయాలు
X

దిశ, వెబ్‎డెస్క్ : భూవివాదంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మర్రిపాడు మండలం జువ్విగుంటలో రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో వివాదం రేగింది. గురువారం ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరగడంతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story