- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వరంగల్: కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనై.. కన్నపేగు బంధాన్ని కడతెర్చారు. ఆపై వారు ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డోర్నకల్ మండలం మన్నెగూడెంకు చెందిన అక్కిబాబు(28)కు చిలక్కోయలపాడుకు చెందిన కృష్ణవేణితో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు వైష్ణవి ఉంది. కృష్ణవేణికి అత్తమామలతో తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈనేపథ్యంలో గత రెండు రోజుల క్రితం కృష్ణవేణి తన కూతురిని వెంటబెట్టుకుని పుట్టింటికి చేరింది. ఇక అక్కిబాబు కూడా బుధవారం రాత్రి భార్య వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఈ దంపతుల మధ్య మరొసారి గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన దంపతులు తన కూతురిని నీటితొట్టిలో వేసి చంపారు. అనంతరం వారు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.