- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కీసర: దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ఛైర్మెన్, వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు తిరుగుబావుట ఎగురవేశారు. వివరాల్లోకి వెళితే.. దమ్మాయిగూడ మున్సిపల్లో ఛైర్మెన్, వైస్ చైర్మన్లు కలిసి ఒంటెద్దు పోకడ పోతూ.. మున్సిపల్ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, అక్రమ నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో అవకతవకలను ప్రోత్సహిస్తున్నారని, కౌన్సిల్లో అధికారులతో కుమ్మక్కై ఈ తతంగం కొనసాగిస్తున్నారని,ఒకే పార్టీ అని మంత్రి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేదని తెలిపారు.
అంతేకాకుండా మున్సిపల్లో ఇలాగైతే.. భవిష్యత్లో ప్రజల చేత తిరస్కరణకు గురైయ్యే అవకాశాలున్నాయని అందుకే మా పట్టణ ప్రజల బాగోగులను, మా విలువలను కాపాడుకునేందుకు ఏం చేయాలనే విషయం పై సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని మనసులోని మాటను కౌన్సిలర్లు వెళ్లడించారు. ఈ సమావేశానికి 12 మంది కౌన్సిలర్లు నాను నాయక్, మంగలపురి వెంకటేష్, రామరం నర్సింహా గౌడ్, మాదిరెడ్డి నర్సింహారెడ్డి, వెంకట రమణ, కౌన్సిలర్ల భర్తలు పాండాల యాదగిరి గౌడ్, హరి గౌడ్, మోర నరహరి రెడ్డి, కొత్త శ్రీనివాస్ గౌడ్, కొత్త భాస్కర్ గౌడ్, నాగాయపల్లి శ్రీనివాస్, సుజాత తూముకుంట మున్సిపల్ లోని అలంకృత రిసార్టులో బస చేశారు.