ఒక్క రోజే 354 కరోనా మరణాలు

by  |
ఒక్క రోజే 354 కరోనా మరణాలు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 354 కరోనా మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. ఈ ఏడాదిలో అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. గతేడాది డిసెంబర్ తర్వాత మళ్లీ కరోనా మరణాలు 300 దాటడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,62,468కు చేరింది. కొత్తగా మరో 53,480 కేసులు నమోదయ్యాయని, ఫలితంగా మొత్తం కేసులు 1,21,49,335కు చేరాయని కేంద్రం తెలిపింది. కరోనా విజృంభిస్తుండటంతో క్రియాశీలక కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దేశంలో మొత్తం 5,52,566 యాక్టివ్ కేసులున్నట్టు వెల్లడించింది.



Next Story

Most Viewed