దేశంలో 1,160 కరోనా కేసులు.. 31 మరణాలు

by B.Srinivas |

<p>న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం కొత్తగా 20 కొత్త కరోనా కేసులు వెలుగు చూసాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,160కు పెరిగింది. అలాగే కరోనా మరణాల సంఖ్య 30ని దాటింది. పశ్చిమ బెంగాల్ లో తాజాగా ఒకరు కరోనాతో చనిపోగా.. మృతుల సంఖ్య 31కి చేరింది. మహారాష్ట్ర, కేరళలలో కరోనా బీభత్సాన్ని సృష్టిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 215 కరోనా వైరస్ కేసులు నమోదవగా, కేరళలో 202 కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో 83, తెలంగాణలో [&hellip;]</p>

దేశంలో 1,160 కరోనా కేసులు.. 31 మరణాలు
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం కొత్తగా 20 కొత్త కరోనా కేసులు వెలుగు చూసాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,160కు పెరిగింది. అలాగే కరోనా మరణాల సంఖ్య 30ని దాటింది. పశ్చిమ బెంగాల్ లో తాజాగా ఒకరు కరోనాతో చనిపోగా.. మృతుల సంఖ్య 31కి చేరింది. మహారాష్ట్ర, కేరళలలో కరోనా బీభత్సాన్ని సృష్టిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 215 కరోనా వైరస్ కేసులు నమోదవగా, కేరళలో 202 కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో 83, తెలంగాణలో ఈ కేసులు 70కి చేరువయ్యాయి. కరోనా మరణాలు మహారాష్ట్రలో (6) అత్యధికంగా చోటుచేసుకున్నాయి. గుజరాత్ లో ఐదుగురు, కర్ణాటకలో ముగ్గురు కరోనాకు బలయ్యారు.

Tags: coronavirus, india, death toll, count, cases

Next Story