కరోనా టీకా నిరాకరిస్తే రేషన్, కరెంట్.. కట్

by  |
కరోనా టీకా నిరాకరిస్తే రేషన్, కరెంట్.. కట్
X

దిశ, వాజేడు: కరోనా టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే 45సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు కరోనా టీకాలు వేయిస్తున్నారు. కాగా కొందరు టీకా పై అపోహలు పెట్టుకొని టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు టీకా వేయడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. టీకా వేయించుకొని వ్యక్తులకు కొన్ని ఆంక్షలతో అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. కరోనా టీకాలు వేసుకోవడానికి ఎవరైతే నిరాకరిస్తారో వారికి రేషన్ కరెంట్ కట్ చేస్తానని ఆంక్షలు పెట్టి హుకుం జారీ చేశారు. వాజేడు మండలం లో కరోనా టీకాల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.


Next Story

Most Viewed