కరోనా చికిత్స జర్నలిస్టులకు ఉచితంగా చేయాలి

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సను జర్నలిస్టులకు ఉచితంగా అందేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (ఐజేయు అనుబంధం) విజ్ఞప్తి చేసింది. కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉండి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారని, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ కింద హెల్త్ కార్డులు ఉన్నవారందరికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందించాలని యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. ఇప్పటికే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో ప్రభుత్వం చొరవ తీసుకుని నిర్వహిస్తోందని, ఇకపైన చికిత్స విషయంలోనూ ఇదే తరహా చొరవ తీసుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సను ఉచితంగా చేసేలా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.



Next Story

Most Viewed