కేరళ గవర్నర్‌కు కరోనా పాజిటివ్

by  |
కేరళ గవర్నర్‌కు కరోనా పాజిటివ్
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రముఖులు వైరస్ బారిన పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కరోనా బారినపడ్డారు. అయితే, ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కానీ, ఆందోళన చెందాల్సిన పనిలేదు. న్యూఢిల్లీలో గతవారం తన కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని కరోనా టెస్టు చేసుకోవాల్సిందిగా లేదంటే ముందుజాగ్రత్తగా అబ్జర్వేషన్‌లో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed