‘సాగర్’‌ టీఆర్ఎస్ అభ్యర్ధి భగత్‌కు కరోనా.!

by  |
‘సాగర్’‌ టీఆర్ఎస్ అభ్యర్ధి భగత్‌కు కరోనా.!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కరోనా పంజా విసురుతోంది. సాగర్ ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కరోనా బారినపడినట్టు సమాచారం. అలాగే, అధికార పార్టీ ముఖ్య నేతలకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే క్రమంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం.

ఇప్పటి వరకు సాగర్ నియోజకవర్గంలోని పెద్దపూరలో 59, హాలియాలో 66, గుర్రంపోడులో 11, నిడమనూర్‌లో 7, సాగర్‌లో 17 కేసులు నమోదు అయ్యాయి. సాగర్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 160 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. పోలింగ్ కారణంగా కరోనా కేసులు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed