ఇంటింటి సర్వే నిర్వహించిన ఆశా వర్కర్‌కు కరోనా

by  |
ఇంటింటి సర్వే నిర్వహించిన ఆశా వర్కర్‌కు కరోనా
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గ్రామానికి చెందిన ఆశా కార్యకర్తకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆమె గత వారం నుండి ఇంటింటా తిరుగుతూ సర్వే నిర్వహించినట్లు తెలిసింది.

బుధవారం ఉదయం గ్రామంలో జరిగిన ఒక వ్యక్తి అంతక్రియలకు ఆమె భర్త హాజరయ్యాడు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి ఆ గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

Next Story