రాచకొండ కమిషనరేట్ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా

by  |
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధరాణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత తరుణంలో పోలీసులందరూ జాగ్రత్తగా ఉండాలని భగవత్ సూచించారు. అంతేగాకుండా.. కమిషనరేట్‌లో ఇప్పటికే 95 శాతం మంది పోలీసులకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 43 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ 200 కర్ఫ్యూ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. మాస్కులు ధరించని వారిపై 16 వేల కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.



Next Story