కాకినాడలో ఏడు కరోనా అనుమానిత కేసులు

by Vemula.Srinu Prasad |

<p>ఏపీలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, కరోనా నిరోధానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 70 అనుమానిత కేసులు నమోదు కాగా, 57 కేసులో కరోనా నెగెటివ్ వచ్చింది. మరో 12 కేసులకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. ఒక కేసు పాజిటివ్‌గా నమోదైందని ప్రభుత్వ వర్గాలు [&hellip;]</p>

కాకినాడలో ఏడు కరోనా అనుమానిత కేసులు
X

ఏపీలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, కరోనా నిరోధానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 70 అనుమానిత కేసులు నమోదు కాగా, 57 కేసులో కరోనా నెగెటివ్ వచ్చింది. మరో 12 కేసులకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. ఒక కేసు పాజిటివ్‌గా నమోదైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించింది.

tag; corona, kakinada, ap news

Next Story