గద్వాలలో మరొకరికి కరోనా పాజిటివ్

by  |

దిశ, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్టు జిల్లా వైద్యలు తెలిపారు. కర్నూలులో డాక్టర్ ఇస్మాయిల్ దగ్గర వీరు వైద్యం చేసుకున్నట్లు గుర్తించారు. ఆ డాక్టర్‌కు కరోనా సోకిందని గుర్తించినప్పటి నుంచి ఆయన వద్ద ఎవరెవరు వైద్యం చేయించుకున్నారనే విషయంపై అధికారులు దృష్టి సారించారు. గడిచిన రెండు రోజులుగా ఆయన వద్ద వైద్యం చేసుకున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారి కుటుంబీకులతోపాటు, అనుమానం ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
Tags;corona virus,Gadwala,positive case

Next Story