ఓనర్ వద్దనడంతో ఆఫీస్‌లోనే క్వారంటైన్

by  |
ఓనర్ వద్దనడంతో ఆఫీస్‌లోనే క్వారంటైన్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి నిర్మల్ పట్టణంలోని ఒక కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే కరోనా సోకిన విషయం ఇంటి ఓనరుకు తెలియడంతో తనను ఇంట్లోకి రావడానికి అనుమతించకపోవడంతో ఆ ఉద్యోగిని ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ గదిని క్వారంటైన్ చేసుకుని ఉంటున్నాడు.



Next Story

Most Viewed