డెలివరీకి వచ్చిన గర్భిణీకి కరోనా.. డాక్టర్లు ఏం చేశారో తెలుసా..?

by  |
డెలివరీకి వచ్చిన గర్భిణీకి కరోనా.. డాక్టర్లు ఏం చేశారో తెలుసా..?
X

దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. కరోనా సోకిన మహిళకు డెలివరీ చేశారు. పాపకు జన్మనివ్వడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. సూర్యనగర్‌కు చెందిన ఓ గర్భిణీ మహిళ డెలివరీ కోసం శారదానగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అయితే, రిపోర్టులో మాత్రం పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు సర్జరీ చేసి డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యుల చొరవతో బంధువులు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.



Next Story