ఆ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్.. ఆందోళనలో నేతలు

by  |
ఆ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్.. ఆందోళనలో  నేతలు
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కరోనా సోకింది. ఇటీవలే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులు అయిన తోట త్రిమూర్తులు వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే నీరసంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. అయితే వైద్యుల సూచనలతో తోట త్రిమూర్తులు స్వగ్రామం వెంకటాయపాలెంలో హోమ్ ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారు. గత కొన్ని రోజులుగా తోట త్రిమూర్తులు వరుసగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయనతో టచ్‌లో ఉన్న పలువురు వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే తనతో సన్నిహితంగా ఉన్న అధికారులు మరియు వైసీపీ కార్యర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తోట త్రిమూర్తులు సూచించారు.

Next Story

Most Viewed