- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కరోనా తగ్గిపోయిందనుకోని చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు. కొంత మంది అసలు మాస్క్నే యూజ్ చేయట్లేదు. ఈ క్రమంలో తాజాగా సంగారెడ్డిజిల్లాలోని మహాత్మజ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ముత్తంగి గ్రామంలోని జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజీలో విద్యార్థులకు కరోనా సోకడంతో ఆందోళన నెలకొంది. కాలేజీ యాజమాన్యం కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఒక్కసారిగా 43 మంది విద్యార్థులకు, ఒక లెక్చరర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిని కాలేజీలోనే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు వీరితో క్లోజ్గా ఉన్నవారికి కూడా మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఘటనతో కరోనా పోయిందని కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిచడంతో మళ్లీ కరోనా విజృంభించే అవకాశం ఉందని అందువలన అందరూ విధిగా మాస్క్ ధరించాలని కోరారు.