ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్

by  |
MLC Surabhi Vanidevi
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆమె స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకొని హోమ్ ఐసోలేషన్లో ఉండాలని ఆమె సూచించారు. కాగా ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది కలిశారు. మండలి సమావేశాల్లోనూ పలువురు కలిశారు. దీంతో వారంతా టెన్షన్ పడుతున్నారు.


Next Story

Most Viewed