టీఆర్ఎస్‌పై కరోనా పంజా.. ఎమ్మెల్యే దంపతులకు పాజిటివ్

by  |
MLA Gongidi Sunitha Mahender Reddy couple
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ మహమ్మారి బారిన పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ రాగా, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు సైతం మహమ్మారి బారినపడ్డారు. అంతేగాకుండా… తాజాగా టీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed