- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం తాజాగా 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ 13 మందిలో మంత్రి అజయ్కుమార్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం గమనార్హం. ఇందులో మంత్రి కార్యక్రమాలను కవర్ చేసేందుకు ప్రత్యేకంగా నియమించుకున్న ఓ వీడియో జర్నలిస్టు ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవల మంత్రి పాల్గొన్న పలు కార్యక్రమాలతో పాటు క్యాంపు కార్యాలయంలోని సిబ్బందితో.. బాధిత వ్యక్తులు సన్నిహితంగా మెదలడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం వీరిద్దరూ హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.
Next Story