ఏడాదిగా ఇంట్లో ఉన్నా.. కరోనాను ఆపలేకపోయాను

by  |
ఏడాదిగా ఇంట్లో ఉన్నా.. కరోనాను ఆపలేకపోయాను
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో కరోనా విలయతాడవం చేస్తుంది. ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఎక్కువగా బయట తిరగకూడదు, తప్పని సరి మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తాను ఏడాదిగా ఇంట్లో ఉన్నా.. కరోనా పాజిటివ్ వచ్చినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏడాది నుంచి ఇంటిలోనే ఉన్నాను. ఎవరినీ ఇంట్లోకి రానివ్వలేదు.. ఏడాది నుంచి నేను బయటికి వెళ్లలేదు అయినా నాకు కరోనా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బానే ఉందని, హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు.



Next Story