కామారెడ్డి ‘వకీల్ సాబ్‌‌’లపై కరోనా పంజా

by  |
Corona virus
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్‌లో ఇప్పటివరకు 15 మంది న్యాయవాదులకు కరోనా సోకిందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెలభిక్షపతి రాష్ట్ర హైకోర్టుకు, బార్ కౌన్సిల్‌కు నివేదిక పంపారు. 15 మంది న్యాయవాదులలో 11 మంది న్యాయవాదులు చికిత్స పొంది కోలుకున్నారని, ఒక న్యాయవాది చనిపోయారని, మిగతా ముగ్గురు న్యాయవాదులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. కామారెడ్డిలో కరోనా విజృంభన దృష్ట్యా నెలరోజుల ముందుగానే కోర్టులో విధులు బహిష్కరించి కరోనా మహమ్మారిని కట్టడి చేశారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నివేదికను పంపినట్లు కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి వెల్లడించారు.


Next Story