ఏపీలో కొత్తగా 116 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 116 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 41,910మందికి పరీక్షలు నిర్వహించగా 116మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,87,836కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,153గా ఉంది. ప్రస్తుతం 1,278యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,79,405మంది సురక్షితంగా ఇళ్లకు చేరారు. ఒక్కరోజులో 127మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో 17, తూర్పుగోదావరి జిల్లాలో 9, గుంటూరులో 13, కడపలో 9, కృష్ణా జిల్లాలో 24, కర్నూలులో 7, నెల్లూరులో 5, ప్రకాశం జిల్లాలో 1, శ్రీకాకుళం జిల్లాలో 4, విశాఖపట్నంలో 13, పశ్చిమగోదావరి జిల్లాలో 11 కేసులు వచ్చాయి. విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. ఇవాళ కరోనా మరణాలు సంభవించలేదని హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed