ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 49,483మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 139మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,557కి చేరింది. ప్రస్తుతం 1,522 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,77,893మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,27,39,648మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 8మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ కాగా చిత్తూరులో 20, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 17, కడపలో 4, కృష్ణా జిల్లాలో 35, కర్నూలు 6, నెల్లూరు 5, ప్రకాశం 9, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 7, విజయనగరం 5, పశ్చిమగోదావరి జిల్లాలో 7 పాజిటివ్ కేసులు వచ్చాయి. గడిచిన 24గంటల్లో కరోనాతో ఎవరూ చనిపోలేదని హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed