ఏపీలో కొత్తగా 510 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 510 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 67,495మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 510మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,75,025గా ఉంది. ముగ్గురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,052కి చేరింది. ప్రస్తుతం 5,078 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,62,895మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 665మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,07,67,117 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 89, తూర్పుగోదావరిలో 47, గుంటూరులో 74, కడపలో 21, కృష్ణాలో 82, కర్నూలులో 22, నెల్లూరులో 17, ప్రకాశంలో 34, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 18, విజయనగరంలో 17, పశ్చిమగోదావరిలో 60 కేసులు వచ్చాయి. కరోనా బారిన పడి గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed