- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. కరోనా సోకిన వారిలో ప్రతిరోజూ ఐదుగురికి తగ్గకుండా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్ తొలిరోజుల్లో వైరస్ వ్యాపిస్తున్నా రాష్ట్రంలో మరణాల రేటు ఊరట కలిగేలా ఉండేది. అయితే ప్రస్తుతం నిత్యం కరోనా మరణాలు సంభవిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటిస్తుండటంతో పరిస్థితి చేయిదాటిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. కరోనాతో ఆరుగురు మృతి చెందగా.. 178 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 148కి చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 3,920కు చేరుకోగా.. వీరిలో 1,742 మంది డిశ్చార్జి అయ్యారని వైద్యారోగ్య శాఖ పేర్కొంటుంది. మరో 2,030 మంది పాజిటివ్ వ్యక్తులు చికిత్స పొందుతున్నారు.
Next Story