నారాయణపేటలో మరో కరోనా పాజిటివ్ 

by  |
నారాయణపేటలో మరో కరోనా పాజిటివ్ 
X

దిశ, మహబూబ్ నగర్ :
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని వ్యక్తికి కరోనా నిర్దారణ అయింది. వైద్యులు అతన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లాలో రెండు కేసులు నమోదు కాగా, ఇపుడు నారాయణపేట జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story