నాలుగు స్కూళ్లలో కరోనా కలకలం

by  |
నాలుగు స్కూళ్లలో కరోనా కలకలం
X

దిశ, వెబ్‎డెస్క్ :
ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. నాలుగు జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని నలుగురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్‎ కరోనా బారిన పడ్డారు. త్రిపురాంతకం హైస్కూల్‌లో ఒక టీచర్‎కు, పీసీపల్లి హైస్కూల్‌లో ఓ విద్యార్థి, టీచర్‎కు కరోనా సోకింది. ఇక హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లి హైస్కూల్‌లో ఓ టీచర్‎ కరోనా బారిన పడ్డారు. నాలుగు ప్రాంతాల్లోని స్కూళ్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


Next Story

Most Viewed