నాగర్ కర్నూలులో కరోనా పాజిటివ్

by  |
నాగర్ కర్నూలులో కరోనా పాజిటివ్
X

దిశ, మహబూబ్ నగర్ :
నాగర్ కర్నూలు జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపింది. జిల్లాలోని చారగొండ మండలం రామ చంద్రపురంనకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్ పల్లి ఆస్పత్రి ఐసోలేషన్ సెంటర్‌లో ఉంచి బాధితుడికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.ఇటీవల గ్రామంలో నిర్వహించిన దావత్‌లో బాధితుడు పాల్గొన్నట్టు తెలియగా, గ్రామంలో 25 మంది ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించారు.ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రామచంద్రపురాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించి, గ్రామస్తులను హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

Next Story

Most Viewed