ఆసుపత్రి పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య..

by  |
ఆసుపత్రి పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆసుపత్రి మూడో అంతస్తు పై నుంచి దూకి కరోనా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య(50)కు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను.. ఈరోజు ఆసుపత్రి పై నుంచి కిందకు దూకడంతో.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు.



Next Story

Most Viewed