ప్రజా ప్రతినిధులను వదలని కరోనా

by  |
ప్రజా ప్రతినిధులను వదలని కరోనా
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజూ వందలాది కేసులు నమోదవుతూ ఏపీ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తొలుత కరోనాకు దూరంగా ఉన్న ఉత్తరాంధ్రను సైతం కరోనాకు వణుకిస్తోంది. తాజాగా మంత్రి బొత్స కుటుంబంలో కరోనా కలకలం రేగింది. బొత్స మేనల్లుడు చిన్న శీను కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లాలో చిన్న శ్రీను ప్రముఖ రాజకీయ నేత. దీంతో, ఆయనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లిపోయారు. క్వారంటైన్ లోనే ఉండాలని తన గన్ మెన్ కు కూడా ఆయన సూచించారు.

Next Story

Most Viewed